*అమలాపురం దాడులను ఖండించిన పవన్ కళ్యాణ్
*ప్రజలంతా సంయమనం పాటించాలి
*శాంతిభద్రతలు పాటించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది..
*ఈ దాడులు చేస్తున్నది జనసేనే అన్న హోమంత్రి వ్యాఖ్యలను ఖండించిన పవన్
అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు.
అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని ఆరోపించారు. పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోనేందుకు లేని సమస్యలు సృష్టిస్తున్నారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దంటూ ఆయన హితవు పలికారు
ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు.. రాష్ట్రానికంతా తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ నేతల ప్రమేయం: షర్మిల