ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం తనను గుర్తించపోవడంతో ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిను ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఆయన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ ఎస్ఇసీ గా గుర్తించపోవడంతో రమేశ్ కుమార్ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ వేశారు.