telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: చంద్రబాబు

chandrababu

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో అనేక విపత్తులలో ప్రజలకు వెన్నంటి నిలిచామని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పని చేశామని అన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూడా బాధితులకు అండగా ఉండాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలని అన్నారు. ప్రభుత్వానికి తాము రాసిన లేఖల ద్వారా కొన్ని వర్గాలకు మేలు జరిగిందని, విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. అరువుపై ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులకు కల్పించిందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రైతు భరోసా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పేర్లు తొలగించారని దుయ్యబట్టారు.

Related posts