తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యా మండలి. గత ఏడాది నిర్వహించిన యూనివర్సిటీలకే ఈ సారి ఆయా ఎంట్రెన్స్ ల నిర్వహణ బాధ్యత ఇవ్వనుంది విద్యామండలి. అయితే కొన్ని సెట్స్ కి మారారు కన్వీనర్ లు. ఎంసెట్, ఈసెట్ పరీక్షలను జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటీకి అప్పగించారు. టీఎస్ పీఈసెట్ నిర్వహణను ఈ ఏడాది కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగించారు. ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ రెక్టార్ గోవర్ధన్, ఈసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి వ్యవహరించనున్నారు. ఐసెట్ కన్వీనర్గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాజిరెడ్డిని నియమించారు. 7 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లకు గాను మూడు ఎంట్రెన్స్ టెస్ట్ ల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యామండలి. మిగతా ఎంట్రెన్స్ లు డిగ్రీ పరిక్షలతో ముడి పడి ఉండడం తో పెండింగ్ లో పెట్టింది మండలి.
ఎంసెట్ పరీక్ష : జులై 5 నుండి 9 వరకు
ఈసెట్ పరీక్ష : జులై 1
పీజీ ఈసెట్ : జూన్ 20 వ తేదీ