telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఆ వివాదం పై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న ధోనీ!

Dhoni Amrapali Group company supreme court

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నాడు.తనకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో పాటు ఓ ఇంటి విషయంలోనూ ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందని ధోని పేర్కొన్నాడు.009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా మార్చుకోవడంతోపాటు పలు వ్యాపార విషయాల్లో ఆమ్రపాలి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ధోనీకి చెల్లించాల్సిన రూ.40కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని అమ్రాపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ ధోనికి యాజమాన్య హక్కులు కల్పించలేదు.

అంతేకాదు సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోని బాధ్యతలను అర్ధాంతరంగా నిలిపివేసింది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ అయిన ఆమ్రపాలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఆ సంస్థపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఆమ్రపాలి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన 46 వేల మంది సంస్థ తమను మోసం చేసిందంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆ సంస్థకు చెందిన ఉప సంస్థలు, డైరెక్టర్ల ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Related posts