telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తగ్గుతున్న ప్రయాణికుల సంఖ్య.. ప్రత్యేక రైళ్లలో స్టాపుల కుదింపు!

Train Indian railway

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత తొలి వారం రోజుల్లో ప్రయాణికులు పోటెత్తగా ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చాలా స్టేషన్లలో అసలు ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ లేదు. దీంతో ఇప్పుడు ఇలాంటి స్టేషన్లలో రైళ్లను నిలపకూడదని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

స్టాపులను కుదించాలని నిర్ణయించిన రైల్వే శాఖ ఆ జోన్లలో ఇలాంటి స్టేషన్లను గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. మరోవైపు, సికింద్రాబాద్-పాట్నా, పాట్నా-సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. వీటిని వారానికి రెండు రోజులు మాత్రమే నడపనున్నారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌తో పలు రైళ్లలో వందల సంఖ్యలో బెర్త్‌లు ఖాళీగా మిగిలిపోతున్నట్టు అధికారులు తెలిపారు.

Related posts