కొత్త మోటారు వాహన చట్టం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించేవారికి చుక్కలు చూపిస్తోంది. దీనిని అమలు చేసి 20 రోజులు దాటుతుండగా, వాహనదారుల నుంచి కొన్ని వేల రూపాయలు చలానాల రూపంలో వసూలయ్యాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక కొత్త స్కూటరుకు దాని ఖరీదు కన్నా అధికంగా జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. భువనేశ్వర్లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్ను కటక్లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు.
దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఇంతేకాకుండా భువనేశ్వర్ ఆర్టీవో అధికారులు ఆ డీలర్షిప్ నకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సును రద్దు చేస్తామన్నారు. అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా స్కూటర్ను ఎలా డెలివరీ చేశారని డీలర్ను ప్రశ్నించారు. కాగా కొత్త మోటారు వాహన చట్టం కింద వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబరు, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటిని వాహనాన్ని అప్పగించే ముందు కొనుగోలుదారునికి డీలర్ అందజేయాల్సివుంటుంది.
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి