*గౌతమ్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు..
*గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు..
*గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరం..
*వివాదాల జోలికి పోకుండా గౌతమ్రెడ్డి హుందాగా పనిచేశారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మేకపాటి భౌతిక కాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి హైదరాబాద్ లోని నివాసానికి తీసుకువచ్చారు. మేకపాటి పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన మరణించారని తెలుసుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చంద్రబాబు.. హైదరాబాద్లోని గౌతమ్రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తక్కువ సమయంలో గౌతమ్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. వివాదాల జోలికి పోకుండా గౌతమ్రెడ్డి హుందాగా రాజకీయం చేశారు.
గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని అన్నారు.. గౌతమ్రెడ్డి వివాదాల జోలికి వెళ్లలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలి అని చంద్రబాబు చెప్పారు.
సుజనా బంధువులకు 124 ఎకరాలు.. భూముల చిట్టావిప్పిన బొత్స