telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే పై పోలీసులకు రైతుల ఫిర్యాదు!

amaravathi mla farmers

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో అమరావతి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు తీవ్రమయ్యాయి. గత కొన్నిరోజులుగా ముమ్మరంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ రైతులు పోలీసులను ఆశ్రయించారు.

రాజధానిపై తీవ్ర అనిశ్చితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని రైతులు విమర్శించారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు.

Related posts