రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏపీటీఎస్ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు.
అదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని అన్నారు. భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వేకు సంబంధించిన టెండర్ల ఫైళ్లను సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఉంచారు.