*గరంగరంగా గన్నవరం పాలిటిక్స్
*వంశీతో కలిసి పనిచేయనని సీఎంకి చెప్పా..
*వంశీ తనను అవమానాలకు గురి చేశాడు
గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో వర్గ పోరు వేరే లెవెల్ కు చేరింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు దుట్ట రామచంద్ర, యార్లగడ్డ ఇద్దరూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దుట్టాకు చెందిన ఆస్పత్రి శంకుస్థానకు వెళ్లిన యార్లగడ్డ మొదట కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఒకవేళ అధిష్టానం వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. తాను కచ్చితంగా సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అధిష్టానానికే చెప్పాను అన్నారు. వంశీ తనను అవమానాలకు గురి చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నుండి వైసీపీ లో వంశీ చేరిన తర్వాత తన ఇంటికి వస్తానని వంశీ పదే పదే తనకు ఫోన్ చేశాడని చెప్పారు. కానీ వైఎస్ జగన్ ఆదేశాలు వచ్చే వరకు తన ఇంటికి రావొద్దని తాను వంశీకి చెప్పానన్నారు. జగన్ చెప్పిన తర్వాతే వంశీ తన ఇంటికి వచ్చినట్టుగా దుట్టా రామచంద్రారావు చెప్పారు.
తాను ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం లేదన్నారు దుట్టా రామచంద్రరావు.40 ఏళ్లుగా తాను మనుషులకు మాత్రమే వైద్యం చేశానని, జంతువులకు మాత్రం వైద్యం
చేయలేదన్నారు.
ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ: మాజీ మంత్రి ఆలపాటి