telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై వెళ్లలేను: నితిన్ గడ్కరీ

Nithin Gadkari

ప్రస్తుత పరిస్థితుల్లో తాను ముంబై వెళ్లే సాహసం చేయబోనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముంబైలో పెద్దమొత్తంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై వెళ్లే ధైర్యం తనకు లేదని చెప్పారు. అయితే, త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయి.

దేశంలోనే అత్యధిక కేసులతోమహారాష్ట్ర ముందు స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ 1,10,744 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత 24 గంటల్లోనే ఏకంగా 1,067 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలను ‘మహా’ సీఎం ఉద్ధవ్ థాకరే ఖండించారు.

Related posts