ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అమరావతిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్ల జాబితాను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది హాజరుకాగా, 1,09,106 మంది ఉత్తీర్ణులయ్యారు.
previous post