భారత జట్టు కరోనా విరామం తర్వాత మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. అందుకోసం యూఏఈ లో ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ కు పయనమైంది. అయితే ఈ పర్యటనలో భారత కెప్టెన్ కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. క్రికెట్ చరిత్రలో 100 శతకాలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత 71 సెంచరీలతో రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు వన్డేలో 43, టెస్టులో 27 శతకాలతో మొత్తం 70 పూర్తి చేసాడు. కాబట్టి ఈ పర్యటనలో కోహ్లీ మరో రెండు శతకాలు చేస్తే మొత్తం 72 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానానికి చేరుకుంటాడు. ఈ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరీన ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డులో కోహ్లీ, రోహిత్ 5 శతకాలతో సమానంగా ఉన్నారు. చూడాలి మరి కోహ్లీ ఈ రెండు రికార్డులను సాధిస్తాడా… లేదా అనేది. అయితే ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.
previous post
next post
పవన్ పొలిటికల్ జర్నీపై నిహారిక ఆసక్తికర కామెంట్స్…