telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ పొలిటికల్ జర్నీపై నిహారిక ఆసక్తికర కామెంట్స్…

Niharika

తాజాగా పవన్ పొలిటికల్ ప్రయాణంపై నాగబాబు కూతురు నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన నిహారిక పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటర్వ్యూల్లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చింది నిహారిక.. పవన్ బాబాయ్ ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడని, ఆయన మితభాషి అని చెప్పింది నిహారిక. ఎప్పుడూ కామ్‌గా ఏదో ఒక పుస్తకం చదువుతూ తన లోకంలో తానుండే బాబాయ్.. రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని వేలమంది ఎదురుగా వేదికపై అలుపెరగని ప్రసంగాలు చేయడం చూసి తాను ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. బాబాయ్ మనసు వెన్న అని, అలాగే ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి అని చెప్పింది. రాజకీయాల్లో అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చింది నిహారిక. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి అటు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts