ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు వేడుకలు నేడు రాజ్ భవన్ లో చిన్నారుల మధ్య జరుపుకొనున్నారు. 86వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆయనకు టీటీడీ, కనకదుర్గమ్మ దేవస్థాన పండితులు ఆశీర్వచనం అందించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..”గౌరవనీయులు, రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పూర్ణాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం మీ సొంతం కావాలనీ, మీరు సదా సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు: సీపీఐ నారాయణ