telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రోజు పాలు తాగుతున్నారా.. ఇవి పాటించాల్సిందే !

పాలు సంపూర్ణ ఆహారం . ఆరోగ్యముగా ఉన్న ఆవు నుంచి అప్పుడే తీసిన ఆవుపాలు అమృతతుల్యమైనవి. ఈ పాలు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అవుతాయి. కడుపుబ్బరం, పైత్యం , దగ్గును నయం చేయును . ఆవుపొదుగు నుంచి తీసిన పాలను వెంటనే నిలువ ఉంచకుండా తాగవలెను లేదా వేడిచేసి తాగవలెను. శుభ్రతలేని పరిసరాలలో పాలు తీసినప్పుడు ఆ పాలను మరగకాయాలి. ఆవుపాలను ఇతర ఆహారంతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు . పాల యొక్క పోషకాలను గరిష్టంగా పొందాలి అంటే ప్రతినిత్యం తీసికొనవలెను. పాలను ఎక్కువ మొత్తములో తీసుకుంటే అందులోని క్యాల్షియం , ఇతర ఖనిజ లవణాలు ఉదరములోని ఆమ్లతత్వాన్ని అడ్డుకొని ఒకరకమయిన ఎంజైము ఉత్పత్తిని తగ్గించును . కడుపు మంచిగా తయారగును. పాలలో ఉండే లాక్టిన్ పేగుల్లోకి డైరెక్టుగా ప్రవేశించి బ్యాక్టీరియా చురుకుదనాన్ని తగ్గించును . కేవలం ఒక శాతం లాక్టోస్ బ్యాక్టిరియాను అడ్డుకుంటుంది.

ఆవుపాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A , B , C , D , E , O కూడా పాలలో ఉంటాయి. పాలలో ఉండే ప్రొటీన్ కి బయోలాజికల్ విలువ బాగా ఉండి తేలికగా జీర్ణం అగును. శరీరానికి అవసరమయిన ఎమినో ఆమ్లములు దీనిలో ఉన్నాయి . ఐరన్ శాతంకూడా పాలలో లభించును. పాలను ఎప్పుడూ గటగటా తాగకూడదు కొంచం కొంచం చప్పరిస్తూ తాగవలెను. ఇలా చేయడం వలన లాక్టోస్ లాలాజలంతో కలిసి అది జీర్ణం అవ్వడం అక్కడి నుంచే మొదలగును. పాలు ఎక్కువుగా బాలురు , వృద్ధులు , శరీరం క్షీణించినవారు , ఆకలిచే కృశించినవారు , సంగమం వలన అలసట చెందినవారు. పాలు సేవించిన త్వరగా కోలుకుందురు. పంచదార లేదా పటికబెల్లం పాలతో కలిపి సేవించిన శుక్రవృద్ధికరము , బెల్లముతో కలిపి పాలు సేవించుచున్న మూత్రకృచ్చ రోగమును పోగొట్టును . మూత్రకృచ్చ రోగం అనగా మూత్రం బొట్లుబొట్లుగా పడుచూ తీవ్రమైన బాధ కలిగి ఉండు రోగం .
ప్రతినిత్యం రాత్రి సమయముల యందు పాలు తాగుచున్న యెడల అనేక దోషములను పోగొట్టును . పాలు ఎప్పుడూ భోజన సమయానికి రెండు గంటల వ్యవధితో తాగవలెను . లేక భోజనం తినకుండా పాలు సేవించవచ్చు . పాలలో ఎప్పుడూ అన్నం కలిపి తినకూడదు. అలా కలిపి తినుచున్న అజీర్ణరోగం కలుగును. రాత్రి సమయము నందు నిద్రపట్టదు.

* మంచి రంగు లేక రుచి చెడి , పుల్లగా , చెడువాసనతో గడ్డగడ్డలుగా ఉన్నట్టు పాలను వాడరాదు.

* పాలతో ఎల్లప్పుడూ పంచదార , అప్పుడప్పుడు మాత్రం బెల్లం కలిపి మాత్రమే ఉపయోగించవలెను .

* పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.

* చేపలకూర , మాంసాహారం తిని పాలు , పాలపదార్థాలు సేవించిన కుష్టురోగం కలుగును. ఎండుచేపలు కాని పచ్చిచేపలు కాని పాలతో ఉపయోగించకూడదు.

* పుల్లటి వస్తువులు తీసుకున్నపుడు పాలు ఉపయోగించకూడదు.

* ఉలవలు , వరిగెలు , కొర్రలు , అనుములు , అడివి పెసలు మెదలైనవి పాలతో కలిపి తినరాదు. ముఖ్యముగా అనుములు మరియు మినుములు తినిన తరువాత పాలు వాడిన అనారోగ్యం కలుగును . ఇడ్లీ , దోశ తినిన తరువాత టీ , కాఫీ సేవించరాదు.

Related posts