telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖలో మెట్రోరైల్ కార్యాలయాన్ని ప్రారంభించిన బొత్స

Bosta satyanarayana ycp

విశాఖలో మెట్రో రైలు కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రారంభించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యనారాయణతో ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. మెట్రో రైలు గాజువాక కొమ్మాది వరకు మొదట అనుకున్నామని…ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ను కలుపుతూ భోగారం వరకు మెట్రో రైలును పొడగించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్బంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సంస్థ ఎండీ రామకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ మొదటివారం నాటికల్లా…పూర్తి డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి ఆమోదం పొందాక టెండర్లు ఖరారు చేస్తామన్నారు. విశాఖ మెట్రో రైలు నిర్మాణంలో ట్రామ్ కారిడార్ కూడా డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తుల స్థలాల విషయంలో అడ్డంకులు రాకుండా చూస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సిటీలో ఒక కిలో మీటర్ నుంచి 1.75 కి. మీ మధ్య స్టేషన్లు వస్తాయని తెలిపారు.  

Related posts