తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మేనన్. దక్షిణాది భాషా చిత్రాల్లో రాణించిన ఆమె బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్తో కలిసి నటిస్తున్న చిత్రం “మిషన్ మంగళ్”. విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిత్యామేనన్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెడ్ టాప్, బ్లూ జీన్ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా మరోపక్క సొంత రాష్ట్రం కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడంపై ఆ రాష్ట్ర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిత్యామేనన్ వివరణ ఇచ్చుకున్నారు. ఈమేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. “బుద్ధిలేని వారు చేస్తున్న ఆరోపణలపై ఇది నా స్పందన. గత కొన్ని రోజులుగా కేరళ వరదల గురించి నేను ఏమీ మాట్లాడటం లేదని, సోషల్మీడియాలో పోస్ట్ చేయడం లేదని కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా అలాంటి వ్యాఖ్యలకు నేను స్పందించను. అలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దామనుకున్నా. కేవలం కొన్ని విషయాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకుంటా. ఎవరో ఏదో అన్నారని నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే, మీరు సంతోషపడతారు. ఆ తర్వాత మర్చిపోతారు. కానీ, అది కాదు చేయాల్సింది. ప్రస్తుతం పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అందుకోసం మేమంతా కలిసి సాయం చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలియదు. కానీ నేను సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నారు. ఒక సినిమా ఒప్పుకొన్న తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్లో కూడా పాల్గొనడం నా విధి” అంటూ వివరణ ఇచ్చుకుంది.
previous post
next post