telugu navyamedia
సినిమా వార్తలు

రాఖీ అంటే పారిపోతున్నారు : రెజీనా

Regina

రెజీనా, అడవి శేషు, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ‘ఎవరు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో ప్రేక్షకులతో చిత్ర విశేషాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని తన పాత్ర విశేషాలతో పాటు తన సినీ అనుభూతులను పంచుకుంటూ.. రేడియో సిటీలో సందడి చేశారు. మన పాత్రకు వేరేవారు డబ్బింగ్‌ చెబితే భావాల్ని సరిగా వ్యక్తంచేయలేమని, అదే మన పాత్రకు మనమే డబ్బింగ్‌ చెప్పుకుంటే ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుందన్నారు. ‘ఎవరు’ చిత్రంలో తొలిసారిగా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని రెజీనా చెప్పుకొచ్చారు. ఈ చిత్రం తన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రమన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. తాను రాఖీ కడతానంటే అందరూ పారిపోతున్నారని ప్రముఖ సినీ కథానాయిక రెజీనా వ్యాఖ్యానించారు. తనకు సోదరులు ఎవరూ లేరని.. అందువల్లే రాఖీ పండుగను ఎప్పుడూ జరుపుకోలేదన్నారు.

Related posts