అని రావిపూడి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్లక్ష్మణ్, యుగంధర్ టి, ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం. దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ నెలాఖరు వరకు ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. గత షెడ్యూల్ నందు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో ఈ బురుజు దగ్గర జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయట. 2020 జనవరి 12న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ లోపు దీపావళి సందర్భంగా మహేష్ ఫ్యాన్స్కు చిత్రయూనిట్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కొత్త పోస్టర్ను షేర్ చేశారు. “విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి దీపావళి ట్రీట్కు సిద్ధంగా ఉండండి” అని ట్వీట్ చేశారు.
previous post
తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన నీచులు… రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు