telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దీపావళి ట్రీట్‌కు సిద్ధంగా ఉండండి.. : అనిల్ రావిపూడి

Mahesh-Babu

అని రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి, ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. గత షెడ్యూల్ నందు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో ఈ బురుజు దగ్గర జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయట. 2020 జనవరి 12న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ లోపు దీపావళి సందర్భంగా మహేష్ ఫ్యాన్స్‌కు చిత్రయూనిట్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. “విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి దీపావళి ట్రీట్‌కు సిద్ధంగా ఉండండి” అని ట్వీట్ చేశారు.

Related posts