గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏపీ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార, ప్రతిపక్షపార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందని అన్నారు. ఆంధ్రా మరో బీహార్ లా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారని విమర్శించారు.
రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని మండిపడ్డారు. కలిసికట్టుగా పని చేస్తే రాష్ట్రానికి మంచిదని అధికార, ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. వందరోజుల పాలనలో ఏమీ చెయ్యనీ సీఎం జగన్ నిద్రలేవాలని హితవు పలికారు. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని, జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించారు.