సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల లైఫ్ స్టైల్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలకు కూడా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తారు. జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి వేరేగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ న్యూస్ అయ్యింది. సమాజం, పర్యావరణం పట్ల ఎంత పవన్ కల్యాణ్కు ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయన గంగానది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందుకే ఉత్తర భారతంలో పర్యటించి గంగానది తీరుతెన్నులు ప్రత్యక్షంగా పరిశీలించారు. హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు. అయితే ఆ గది చాలా సింపుల్గా ఉంది. అందులో ఓ బెడ్ తప్ప మరేమీ లేవు. గదిలో అతి సాధారణంగా బస చేయడం ద్వారా తతాను ఎంత సింపుల్గా ఉంటారో మరోసారి తన అభిమానులకు చూపించారు పవన్ కల్యాణ్.
JanaSena Chief Sri Pawan Kalyan’s stay at an Asram in Haridwar.
Full Album: https://t.co/CIF3NbK3KV#SaveGanga #SaveRiversOfIndia pic.twitter.com/GScryUZImR
— JanaSena Party (@JanaSenaParty) 11 October 2019
బ్రేకప్ పై ఘాటుగా స్పందించిన శృతి హాసన్