telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇక జగన్ కు చంచల్ గూడ కాదు… విదేశీ జైలే

Nara Lokesh

సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. “ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదు కేసుల మాఫీ కోసం అని తేలిపోయింది. జాతీయ మీడియా లో వస్తున్న కధనాలు చూస్తుంటే త్వరలోనే సీఎం జగన్‌, ఆయన డెకాయిట్ బ్యాచ్ కి మరో సారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోంది. ఈసారి ఏకంగా విదేశీయులు జగన్ రెడ్డి గ్యాంగ్ ఆర్థిక నేరాలపై ఫిర్యాదు చేసారు. ఇక చంచల్ గూడా కాదు విదేశీ జైలే.” అంటూ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. అంతకు ముందు ట్వీట్‌లో “దొంగ పనులు చెయ్యడం దొరికిపోవడం సీఎం జగన్‌ నైజం. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం గెలిచాం అని కాలర్ ఎగరేసిన వైకాపా నాయకులు ఇప్పుడు 80 శాతం గ్రామాల పై పడి ప్రజల ఆస్తులు ధ్వంసం చెయ్యడం ద్వారా వారి గెలుపు లో నిజం లేదని ఒప్పుకుంటున్నారు. టిడిపికి మద్దతు పలికారన్న కక్షతో 110 ఎకరాల్లో జొన్న, వేరుశనగ పంటను నాశనం చేసారు. మరో ఐదు రోజుల్లో చేతికొచ్చే పంటని అధికార మందంతో వైకాపా రౌడి గ్యాంగ్ ట్రాక్టర్లతో దున్నేసారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతుల కన్నీరుకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశంలో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నా ప్రేక్షక పాత్ర వహించి, రైతుల్ని బెదిరించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు.” అంటూ పేర్కొన్నారు నారా లోకేష్‌.

Related posts