telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిశ్రమల్లో స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తాం: రోజా

Roja Mla

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం అవకాశాలు కల్పిస్తామని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఈరోజు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పెట్టుబడిదారులకు అన్నిరకాలుగా సహకరిస్తామని అన్నారు. పరిశ్రమలకు ఏర్పాటుకు పారదర్శకంగా భూముల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.

ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా మహిళలు ఎవ్వరూ బాధ్యతలు చేపట్టలేదని, ఈ అవకాశం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మహిళలను ఎంత గౌరవిస్తుందనడానికి తనకు దక్కిన ఈ పదవే నిదర్శనమని పేర్కొన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగేదని రోజా పేర్కొన్నారు.

Related posts