telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహబూబాబాద్ కు కాళేశ్వరం నీరు: ఎర్రబెల్లి

Minister Erraballi comments Congress

మహబూబాబాద్ జిల్లాకు కాళేశ్వరం నీరు అందిస్తామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ మధ్య కాలంలోనే మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్‌‌లో మెడికల్ కాలేజీ, నూతన ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. పోడు భూముల సమస్యను కూడా పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts