న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసింది వైసీపీ నేతలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని లేఖలో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు లేఖ పై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. చంద్రబాబు లేఖకు సమాధానమిస్తూ నిజానిజాలు తెలుసుకోకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని పేర్కొన్నారు. మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే సీల్డ్ కవర్ లో తనకు పంపాలని కోరారు. మీడియా రూపంలో లేఖలు విడుదల చేయడం తగదని పేర్కొన్నారు.