కడప జిల్లా జమ్మలమడుగులో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
రంగ ప్రవేశం చేసిన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు. సంఘటనా స్థలానికి వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గీయులు తమ వాహనాన్ని ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల మోహరింపుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స