అమరావతి కోసం 60 సెంట్ల భూమిని ఇచ్చిన మహిళా రైతు సామ్రాజ్యం మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగిందని మండిపడ్డారు.
రాజధాని తరలింపు వార్త విని గుండెపోటుతో ఆమె మరణించారని వివరించారు. తుగ్లక్ నిర్ణయాలకు బలవుతున్న రైతుల ఉసురు జగన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మూర్ఖత్వానికి ప్రతిరూపం వైఎస్ జగన్. 79 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్నా ఆయన అహం చల్లారలేదు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుకైనా పెట్టని జగన్ రెడ్డి, మూడు రాజధానులు నిర్మిస్తానంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నాడు” అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు.
సోమారపు పార్టీనీ వీడటం వల్ల నష్టమేమీ లేదు: ఎమ్మెల్యే బాల్క సుమన్