telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

Bjp Manikyala rao

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. కనెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు.

2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Related posts