telugu navyamedia
వార్తలు

విశాఖ క్రేన్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

chandrababu

విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలిన సంఘటనలో పది మంది మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోందని, వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

ఈ మధ్యాహ్నం విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో క్రేన్ కింద నలిగిపోయి పలువురు మృత్యువాత పడ్డారు. క్రేన్ కింద ఇంకా కొందరు చిక్కుకొని ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts