telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో కట్టిన భవనాలను .. చూపకుండా చేసేందుకే మీడియాపై ఆంక్షలు.. : సోమిరెడ్డి

somireddy brother into ycp today

రాష్ట్ర రాజధాని అమరావతిలో భవనాలను కళ్లకు కట్టినట్టు ప్రజల ముందుంచిన మీడియాపైనా ప్రభుత్వం జీఓ 2430 ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కరలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. వేలాది కోట్లతో అద్భుతమైన కట్టడాలు రూపు దిద్దుకుంటున్నాయని, ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పటి వరకు బహుశా వైకాపా శ్రేణులకు కూడా తెలియదేమోనని విమర్శించారు.

ప్రజల కలల రాజధానిలో భారీ భవంతుల నిర్మాణాన్ని ఓర్చుకోలేక వాటిని నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజా రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను అవమానించేలా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన దుయ్యబట్టారు.

Related posts