telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా..

Vallabhaneni-Vamsi tdp

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అన్నీ రంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీమోహన్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా… పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. తనతో కాంటాక్ట్ ఐన వాళ్ళు కరోనా పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 3342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో 22 కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,04,026 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 7,65,991 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6566 మంది మృతిచెందారు.

Related posts