telugu navyamedia
రాజకీయ వార్తలు

నూతన విద్యావిధానాన్ని స్వాగతించిన ఖుష్బూ..కాంగ్రెస్ శ్రేణుల విమర్శలు

kushboo congress

కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానాన్ని సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ స్వాగతించడంపై .కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ‘క్షమించాలి, నేనేమీ రోబోను కాను రాహుల్ జీ’ అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఆమెపై ట్రోలింగ్ మరింత పెరిగింది.

ఖుష్బూ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. దీనిపై ఖుష్బూ వివరణ ఇస్తూ విమర్శలు చేసేవాళ్లందరూ శాంతించాలని సూచించారు. తానేమీ బీజేపీలో చేరడం లేదని, పార్టీతో విభేదించినంత మాత్రాన బీజేపీలో చేరుతున్నట్టా? అని ప్రశ్నించారు.

ఏదైనా అంశంపై సొంత అభిప్రాయం వెల్లడించే హక్కు తనకుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానంలో తాను పాజిటివ్ అంశాలనే చూశానని, మార్పును సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్నది తన భావన అని ఖుష్బూ స్పష్టం చేశారు.

Related posts