telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా మహోగ్రరూపం..జూలైలో భారీగా పెరిగిన కేసులు!

corona vairus

ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో 1,26,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై మాసంలో ఏకంగా 865 శాతం మేర కేసులు పెరిగాయి. మన దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత స్థాయిలో కేసులు పెరగలేదు. కేసుల పెరుగుదల శాతంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను ఏపీ అధిగమించింది.

జూన్ 30వ తేదీ నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,596 మాత్రమే. కానీ, నెల వ్యవధిలోనే ఈ కేసుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రభంజనం మామూలుగా లేదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తూగో జిల్లాలో జూలై నెలలో కరోనా కేసులు ఏకంగా 1,800 శాతం ఎగబాకాయి.

నిన్న ఒక్క రోజే ఏపీలో ఏకంగా 10,376 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నిన్నటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి పెరిగింది. ఇదే సమయంలో కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. మొత్తం 1,349 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

Related posts