పేదల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పథకమే నిదర్శనమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్లో శుక్రవారం జరిగిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భాంగాఆయన మాట్లాడుతూ గతంలో ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ఇచ్చే రూ.70 వేలు సరిపోయేవి కాదన్నారు.
నేడు ప్రభుత్వ స్థలంలో రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. ఈరోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కన్పిస్తోందన్నారు. కలలో కూడా ఊహించని విధంగా కేసీఆర్ పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో మిగిలిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్