telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కరోనాపై సెలెబ్రిటీల సందేహాలు… డాక్టర్ గురవా రెడ్డి సమాధానాలు

corona

కరోనా వైరస్‌పై పోరాటం నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండి దీపాలు వెలిగించాలని, సంఘీభావం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు సామాన్యులతో సహా సెలెబ్రిటీలు సైతం దీపాలను వెలిగించి తమ సంఘీభావం తెలిపారు. అయితే ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్ రాజమౌళి, చిరంజీవి వంటివారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ గురవారెడ్డి సమాధానాలిచ్చారు. సామాన్యులకు ఉండే అపోహలను కూడా తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడిగారో, అందుకు సమాధానాలేంటో చూసి మీరు కూడా తెలుసుకోండి.

ఇక ‘జనతా కర్ఫ్యూ’ తరహాలోనే ప్రజలు దీపాలు వెలిగించాలంటూ మోడీ ఇచ్చిన పిలుపును మరోలా అర్థం చేసుకున్నారు. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడమే కాదు.. ఏకంగా కాగడాలు పట్టుకుని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

Related posts