telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

లైవ్ కవరేజ్ లో రిపోర్టర్ ను ముప్పుతిప్పలు పెట్టిన పంది… వీడియో వైరల్

Pig

గ్రీస్‌లో ఓ న్యూస్ రిపోర్టర్ తనకు ఎదురైన అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేనని చెబుతున్నాడు. ఇంతకూ ఆ అనుభవం ఏంటంటే.. ఇటీవల గ్రీస్‌లోని కొన్ని పట్టణాల్లో పడిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు వరద నీటితో అల్లకల్లోలంగా మారిపోయాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వరదలు ఎంతో నష్టాన్ని మిగిల్చాయి. వరదలు సృష్టించిన నష్టంపై లైవ్ కవరేజ్ ఇవ్వడానికి యాన్ట్ 1 టీవీలో పనిచేస్తున్న లాజోస్ మాంటికోస్ అనే న్యూస్ రిపోర్టర్ కినెటా ప్రాంతానికి వెళ్లాడు. సరిగ్గా స్టూడియోలోని యాంకర్లకు న్యూస్ వివరిస్తుండగా.. లాజోస్ వద్దకు ఓ పంది వచ్చింది. ఆ పంది లాజోస్‌ను కనీసం నిలబడనివ్వలేదు. దీంతో లాజోస్ అటు ఇటు తిరుగుతున్నప్పటికీ.. ఆ పంది కూడా లాజోస్ వెంటే తిరుగుతూ అతడిని కొరకడానికి ప్రయత్నించింది. “ఇక్కడో పంది ఉదయం నుంచి నన్ను వెంబడిస్తోంది.. కనీసం నిలబడనివ్వకుండా కొరుకుతోంది” అంటూ లాజోస్ స్టూడియోలో ఉన్న విలేకరులకు వివరించాడు. లాజోస్ మాటలు విని.. స్టూడియో నుంచి ఈ దృశ్యాన్ని చూసిన యాంకర్లు నవ్వును ఆపులేకపోయారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. ఒక్కసారిగా ట్రెండింగ్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు పందికి రిపోర్టర్ అంటే ఎంతో ప్రేమంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts