telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ ముట్టడికి సిద్దమైన బీజేపీ…

జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ… ప్రగతి భవన్ ముట్టడి కి సిద్దమైంది బీజేపీ పార్టీ. ఈ నేపథ్యం లో ప్రగతి భవన్, హరిత ప్లాజా వద్ద భారీగా మోహరించారు పోలీసులు. కాసేపట్లో హరిత ప్లాజా హోటల్లో బీజేపీ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. హోటల్ హరిత ప్లాజాకు చేరుకుంటున్న బీజేపీ కార్పొరేటర్లు…. హరితప్లాజా నుంచి బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు… అక్కడే భారీగా మోహరించారు. అటు బేగంపేట్ హరిత హోటల్లో గ్రేటర్ బీజేపీ కార్పోరేటర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో చింతల, హైద్రాబాద్ బీజేపీ ఆరు జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. బీజేపీ కార్పోరేటర్లు 48.. సమావేశానికి హాజరైన వారు 31 మంది కార్పోరేటర్లు..16 మంది కార్పోరేటర్లు గైర్హాజరయ్యారు. కరోనా తో మరణించిన లింగోజిగూడ బీజేపీ కార్పోరేటర్ రమేష్ గౌడ్ మృతి చెందిన తెలిసిందే.

Related posts