జమ్మూకశ్మీర్ పరిధిలోని బుద్గాంలో బీజేపీ నేత అబ్దుల్ హమీద్ నాజర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఓమ్ పోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారని, వెంటనే బాధితుడిని శ్రీ మహరాజా హరిసింగ్ హాస్పిటల్ కు తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
హమీద్ నాజర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గడచిన ఐదు రోజుల వ్యవధిలో బీజేపీ నాయకులపై మూడో దాడి జరిగింది. ఇటీవల దక్షిణ కశ్మీర్ లోని క్వాజీగుండ్ లో ఓ సర్పంచ్ ని దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సజ్జాద్ అహ్మద్ అనే మరో నేత కాల్పుల్లో మృతి చెందారు. ఆపై ఆరిఫ్ అనే మరో సర్పంచ్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.