ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. తల్లి చెల్లి, కూతురు, చిన్న, పెద్ద తేడా లేకుండా కామంతో కళ్లు నెత్తికెక్కి మగ మృగాళ్లు రెచ్చిపోతున్నారు.
విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి
ఇంత జరుగుతున్నా ‘‘మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి గారు?. అంటూ ఏపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు.
విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా మీ మనస్సు కరగదా?. పైగా మహిళా హోంమంత్రి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అని మాట్లాడటం అన్యాయమని అన్నారు.
విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డటం దారుణమని అన్నారు.. జే బ్రాండ్ లిక్కర్ తాగి ఉచ్చ నీచాలు మరిచి అత్యాచారానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనలతో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందని లోకేష్ అన్నారు.
దిశ చట్టం పేరుతో చేసిన మోసం చాలు. మహిళలు బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’’ అని లోకేష్ డిమాండ్ చేశారు.
సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు: చంద్రబాబు