ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రజల మద్దతు టీడీపీకి ఉందని అన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ వైఫల్యం చెందారన్నారు అచ్చెన్నాయుడు.
జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ 160 స్థానాలు గెలుస్తుంది. మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానం అన్నారు.
విజయవాడ ప్రభుత్వ హాస్పటల్ లో మతి స్థిమితం లేని అమ్మాయి మీద మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వ స్పందన లేదు. ప్రభుత్వం నుండి ఎవరూ రాక పోతే బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాల కంటే జగన్ చేసింది ఏంటో చెప్పాలి.
అమ్మఒడి మోస పూరిత పథకం. జగన్ ప్రజల్ని మోసం చెయ్యడం తప్ప మరొకటి చెయ్యలేదు. జగన్ పతనం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కి ఒక్క ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారు.పవన్ కల్యాణ్ ని ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
ఫలితాల రోజే కూటమి సమావేశం: చంద్రబాబు