telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో త్వరలో మోగనున్న గుడి గంట!

kanchipuram temple

లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఆలయాల్లో తిరిగి గుడి గంట మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. భౌతిక దూరం పాటించాలని పేర్కొంది.

దర్శనానికి సంబంధించిన టైం స్లాట్‌ను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. ఆలయాల్లో డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయడంతోపాటు శానిటైజేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అలాగే, ఆలయ పరిసరాలను, క్యూలను ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలని ఈవోలకు పంపిన ఆదేశాల్లో పేర్కొంది. అయితే, ఆలయాలు ఎప్పటి నుంచి తెరవాలన్న విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు.

Related posts