నేడు ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అమరావతిపై మంత్రి బొత్స ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజధానికి అమరావతి అనువైనది కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. దీంతో, భయాందోళనలకు గురైన అమరావతి రైతులు పవన్ ను కలసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల పాటు అమరావతిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నేడు ఆయన అమరావతికి వెళ్లనున్నారు.
మంగళగిరిలో బయలుదేరి నవులూరు, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తుళ్లూరు మండలంలోని శాఖమూరు, దొండపాడు, అనంతవరం, యర్రబాలెం, ఐనవోలు, రాయపూడి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు.
పాన్ డబ్బా కొనుక్కునే డబ్బులు లేని నానికి.. అంత డబ్బు ఎక్కడిది…