telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

పాక్ జర్నలిస్ట్ కు మద్దతుగా నగ్మా ట్వీట్: నెటిజన్లు ఫైర్

Nagma

భారత్ పై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ జర్నలిస్టుకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి నగ్మా మద్దతు పలకడం వివాదస్పదంగా మారింది. ‘మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు’ పేరిట ఒక హిందీ టీవీ ఛానెల్ రెండు రోజుల క్రితం చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నగ్మా, పాక్ జర్నలిస్టు తరీఖ్ పీర్జాదా పాల్గొన్నారు. పాక్ ను పొగుడుతూ.. భారత్ ను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శ్రుతి మించడంతో సదరు ఛానెల్ వ్యాఖ్యాత అడ్డుతగిలారు. అయితే, భారత్ పై విషం కక్కుతూ వ్యాఖ్యలు చేసిన పీర్జాదాను ఎండగట్టాల్సింది పోయి వ్యాఖ్యాతపై నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ జర్నలిస్ట్ ను కించపరిచేందుకే ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారా? అంటూ ఆ వ్యాఖ్యాతను ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ చర్చా కార్యక్రమం అనంతరం పాక్ జర్నలిస్ట్ కు మద్దతుగా ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు నగ్మాపై మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలతో పార్టీ గౌరవాన్నీ నగ్మా మంటగలుపుతోందని విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts