telugu navyamedia
రాజకీయ

డప్పు కొట్టిన రోజా..!

నగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా డప్పు కొట్టి దరువేసి సందడి చేశారు. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు. పుత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు. 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర పరికరాలను ఎమ్మెల్యే రోజా అందచేశారు.

అనంతరం డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించి , వారితో ఆడుతూ పాడుతూ ఉత్సాహ పరిచారు. కళాకారులతో రోజా డప్పు కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నియోజకవర్గం అభివృద్ది కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇదే క్రమంలో మంగళవారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌లో పాల్గొన్నారు.

Related posts