telugu navyamedia
రాజకీయ వార్తలు

సరిహద్దుల్లో జరుగుతోన్న వివరాలు వెల్లడించండి: రాహుల్

Rahul gandhi congress

ఇటీవల జరిగిన చైనా-భారత్ అగ్రశేణి కమాండర్ల భేటీలో చైనా కఠిన వైఖరి అవలంబించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పలు ప్రాంతాలు తమవేనని చైనా వాదించిందని వచ్చిన వార్తా కథనాలను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.లడఖ్‌లో భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా ఆర్మీ ఆ ప్రాంతంలోని కొంత భాగాన్ని ఆక్రమించుకుందని ఆరోపించారు.

చైనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధాని తెరమీది నుంచి అదృశ్యమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. లడఖ్‌లో చైనా తీరుతో పాటు సరిహద్దుల్లో జరుగుతోన్న పరిణామాలపై భారత ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు తెలపాల్సిన అవసరం ఉందని రాహుల్న్ అన్నారు.

Related posts