telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దుబాయి : .. రెండు పండ్ల కోసం .. దేశబహిష్కరణ శిక్ష..

dubai court punished man who theft 2 mangoes

ఓ వ్యక్తి రెండు మామిడి పండ్లు దొంగిలించాడని కోర్టు అతడ్ని దేశ బహిష్కరణ చేసింది. భారత్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్‌పోర్టులో పని చేసేవాడు. ప్రయాణీకుల లగేజీని కంటెయినర్‌ నుంచి కన్వేయర్‌ బెల్ట్‌లోకి ఎక్కించడం, అక్కడి నుంచి కిందికి దించడం అతని పని. 2017 ఆగస్టులో విధుల్లో ఉన్న సదరు వ్యక్తి బాగా దాహం వేయడంతో ఒక ప్రయాణికుడి బాక్సు నుంచి రెండు మామిడిపండ్లు దొంగిలించాడు. ఈ విషయం సీసీ టీవీ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు రెండు సంవత్సరాల తరువాత విచారణకు రాగా, దుబాయికి చెందిన ఫాస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పులో కోర్టు అతనికి 5000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ చేసింది. ఈ తీర్పుపై 15 రోజుల్లోగా అతడు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

Related posts