సర్ ఆర్థర్ కాటన్ మహానుభావుని స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కాటన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఒక వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహాశయుడు రుజువు చేశాడని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం లేని రోజుల్లోనే ఆయన రెండు జిల్లాల పరిధిలో ఆనకట్ట, కాలువల వ్యవస్థను కేవలం 5 సంవత్సరాల్లో పూర్తి చేశాడని, ఆయన సంకల్పం మాటలకు అందనిదని కీర్తించారు.
నీటి లభ్యతతో ప్రజల తలరాతను మార్చవచ్చని నిరూపించినకాటన్ స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించిన టీడీపీ, 70 శాతం పనులు పూర్తిచేసిందని చంద్రబాబు వెల్లడించారు. అటువంటి ప్రాజెక్టు ఇవాళ పడకేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.