telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ముచ్చటగా మూడోసారి కంగనాకు నోటీసులు…

కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో నెపోటిజం, మహారాష్ట్రంలో అరాచకం అంటూ సోషల్‌ మీడియాలో బోల్డంత హడావిడి చేస్తోంది కంగన రనౌత్‌. మొదట్లో బీటౌన్‌లో గ్రూపులున్నాయి అందుకే కొత్త వాళ్లు ఎదగలేకపోతున్నారని పోస్టులు పెట్టిన కంగన, ఇప్పుడు డ్రగ్‌ మాఫియాపై విమర్శలు చేస్తోంది. అయితే జనాలు మాత్రం ఈ విమర్శలని నమ్మలేకపోతున్నారు. కంగన సొంత ప్రయోజనాల కోసం సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయినప్పటి నుంచి బాలీవుడ్‌ని టార్గెట్‌ చేస్తూనే ఉంది కంగనా రనౌత్. తాజాగా ముంబై పోలీసులు కంగనా కు సమన్లు జారీచేశారు. ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీచేసిన ముంబై పోలీసులు . తాజాగా కంగనా , రంగోలీ చందేల్ ఇద్దరు ఈనెల 23,24వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మతఘర్షణలు రెచ్చగొట్టే విధంగా కంగనా ట్వీట్స్ చేస్తుందంటూ వారు పేర్కొన్నారు. అక్టోబర్ 26, 27, ఆ తర్వాత నవంబర్ 9, 10 తేదీల్లో హాజరుకావాలంటూ కంగనకు సమన్లు జారీ చేశారు. కానీ రెండుసార్లు వాళ్లు హాజరుకాలేదు.  ఇంట్లో పెళ్లి ఉన్నందున హాజరు కాలేదని అప్పుడు చెప్పుకొచ్చారు.

Related posts